హుజూరాబాద్/ హుజూరాబాద్ టౌన్/ హుజూరాబాద్ రూరల్, జూలై 24: దేశరాజకీయాల్లో వొడితల రాజేశ్వరావు అపర చాణక్యుడిగా పేరుగాంచారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. హుజూరాబాద్ పట్టణం సైదాపూర్కు వెళ్లేదారి సింగాపూర్లో (వొడితెల స్వగ్రామం) రాజేశ్వర్రావు విగ్రమాన్ని ఏర్పాటు చేయగా, ఆయన మనమడు వొడితెల ప్రణవ్బాబు ఆధ్వర్యంలో సోమవారం విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీలు వాణీదేవి, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు వొడితల సతీశ్బాబు, రసమయి బాలకిషన్తో కలిసి రాజేశ్వర్రావు విగ్రహాన్ని మంత్రి హరీశ్రావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర సాధన ఉద్యమంలో రాజేశ్వర్రావు.. కేసీఆర్కు అండగా నిలిచారని చెప్పారు. కేసీఆర్తోనే తెలంగాణ సిద్ధిస్తుందని ఆయన ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. ఆయనది ఓ అసాధారణ, అసమాన వ్యక్తిత్వమని, ఆ చూపులోనే హృదయాన్ని హత్తుకునే ప్రేమ ఉంటుందని కొనియాడారు. సింగాపురం సర్పంచ్గా, సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా దేశ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన గొప్ప నేత రాజేశ్వరరావు అన్నారు. వొడితల వంశంలోనే సేవాగుణం ఉందని రాజేశ్వరరావు బాటలో ఆయన తమ్ము డు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వారి కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనమరాలు నడవడం అభినందనీయమన్నారు. ఆయన నిరాడంబరత, మానవత్వం ఇలా ఎన్నో సుగుణాలు మూర్తీభవించిన ఓ మహాశిఖరమన్నారు. ఉద్యమసమయంలో మమ్మల్ని అప్యాయంగా పిలిచి అన్నంపెట్టిన విశాల హృదయులన్నారు. ఎదుటివారిని గౌరవించే గొప్ప సంస్కారం ఉన్నవ్యక్తిని, మాలాలంటి వారికి నేనున్నానంటూ ధైర్యానిచ్చారని ప్రశంసించారు. రాజేశ్వరరావు కాంగ్రెస్లో ఉండికూడా తెలంగాణ ఆవశ్యకతను వారి పార్టీ వారికి వివరించారని గుర్తు చేశారు.
సేవాదృక్పథంతో విద్యాసంస్థలను నిర్వహించారన్నారు. పత్రికల్లో ఆయన రాసిన వ్యాసాలు ఎంతో మందిని ఉత్తేజితులను చేశాయని చెప్పారు. నాడు నక్సలైట్లకు కూడా ఇష్టమైన వ్యక్తి రాజేశ్వరరావు అన్నారు. వొడితెల కుటుంబం చూపెట్టే మానవత్వం, ప్రేమ, అనురాగాలు తనలో కూడా ఎంతో మా ర్పు తెచ్చాయని చెప్పారు. వారి ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఎంతో ఆప్యాయత, ప్రేమ చివరి శ్వాస విడిచే దాకా ఉందన్నారు. వారు గుర్తుగా వాళ్ల వాహనాలకు 3 నంబరు ఉంటుందన్నారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని ఆచరణలో చూపిన వ్యక్తిత్వం రాజేశ్వరరావుదని కీర్తించారు. కేంద్ర మంత్రులు, సీఎంలు కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసే రోజులు ఉన్న కాలంలోనూ సొంత గ్రామం సింగాపుర్ను మర్చిపోలేదన్నారు. కేసీఆర్కు రాజేశ్వరరావుకు మధ్య ఉండే సాన్నిహిత్యం మాటల్లో చెప్పలేనిదన్నారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, బీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మున్సిపల్ చైర్, వైస్ చైర్పర్సన్లు గందే రాధిక, కొలిపాక, ఎంపీపీ రాణి, జడ్పీటీసీ పడిదం బకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గొప్ప మానవతావాది..
రాజేశ్వర్రావు మానవతకు మానవత్వానికి మా రుపేరు. నేను రాంటెక్లో ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు చైర్మన్, మా గురువుగా, మహనీయుడిగా మా గుండెల్లో చోటు దక్కించుకున్నారు. విద్యాప్రదాతగా, ఎదుటి వ్యక్తి బాధపడితే తక్షణమే స్పందించే విశాలహృదయం కలిగిన గొప్ప నేత రాజేశ్వరావు. నాలాంటి ఎంతో మంది వెనుక బడిన కులాల సంక్షేమానికి కృషి చేసిన గొప్ప నాయకుడు. రాజకీయాల్లో ఆజాత శత్రువు.
– గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి
విగ్రహం ఆయన గుణానికి తీపి గుర్తు
మా అన్నయ్య చూపిన బాటలోనే మా కుంటుం బం నడుస్తుంది. విగ్రహం ఆయన గుణానికి తీపి గుర్తు. ఐదు దశాబ్దాల కా లంలో ఏ ఒక్క రోజు మా కుటుంబంలో మనస్పర్థలు, విభేదాలు రాలేదు. అన్న య్య విగ్రహం మాకు, ఈ ప్రాంత ప్రజలకు స్ఫూర్తిదాయకం. క్రమశిక్షణకు మారు పేరు రాజేశ్వరావు. ప్రత్యేక తెలంగాణ మలి దశ ఉద్యమంలో సీఎం కేసీఅర్కు వెన్నంటి ఉండి ముందుకు నడపిన గొప్ప నాయకుడు. అజాత శత్రువు.
– కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎంపీ
ప్రజల కోసం పరితపించిన నేత
రాజేశ్వరరావు తన చివరి ఊపిరి వరకు ప్రజల కొరకే ఆలోచించిన గొప్ప వ్యక్తి. ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నా. యన సేవలను ఎప్పటికీ మర్చిపోలేనివి. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి. ఆయన మా అందరికీ స్ఫూర్తిదాయకం. వొడితల రాజేశ్వర్రావు చూపిన మార్గంలో ప్రజాసేవలో ముందుకెళ్తాం.
– వొడితల సతీశ్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే
ఊరిపేరునే ఇంటిపేరు మార్చుకున్న గొప్పవ్యక్తి
పుట్టిన ఊరిపేరునే ఇంటి పేరుగా సార్థకం చేసుకున్న గొప్ప వ్యక్తి సింగాపురం (వొడితెల)రాజేశ్వరావు. కులమతబేధాలు లే కుండా అందరిని సమానం గా చూసిన గొప్ప మనసున్న మహానేత. ప్రజాసేవ చేయడంలో ముందు నిలిచిన వొడితల కుటంబమైతే, రెండో వరుసలో కేసీఆర్ కుటుంబానిదే. రాష్ట్ర ఏర్పాటులో తెరవెనుక ఉండి కేసీఆర్లాంటి మహానేతకు సహకరించారు. ఆయన మర్యాదకు మారు పేరు. రాజకీయలకు నెలవు. ఆయన భౌతికంగా లేకున్నా అయన ఆలోచన విధానాలు నేటికి వారి సభ్యులు ముందుకు సాగిస్తున్నారు.
– బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
రాజేశ్వరావు సేవలు మరువలేనివి
రాజేశ్వరావు తన పుట్టిన గడ్డ హుజూరాబాద్ కు అందించిన సేవలు ఎన్నటికి మరువలేనివి. ఇక్క డి ప్రజల కోసం విద్యావేత్తగా మారి విద్యాలయాను నెలకొల్పాడు. ప్రజల అవసరాలు తీర్చేందుకు సాగు, తాగు నీరు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి. ఎంతో మందికి విద్యాదానం చేసి పార్టీలకు అతీతంగా ప్రజలను ఆదరించాడు.
– పాడి కౌశిక్రెడ్డి, మండలి విప్
జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
మాజీ ఎంపీ రాజేశ్వరావు బావ జ్ఞాపకాలు గు ర్తుకు వస్తున్నాయి. ప్రజల సంక్షేమం కోసం పాటు పడిన గొప్ప వ్యక్తి ఆయన. రాజకీయంలో తనకు శత్రువైన దగ్గరకు వస్తే అభయమిచ్చి అక్కున చేర్చుకున్న గొప్ప మానవతవాది. కవి గా, రచయితగా రాజకీయ వెత్తగా, గొప్ప మానవత వాదిగా నాడు అదరికన్న ముందు వరుసలో నిలిచిన మహానేత. ఆయనను స్మరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్న.
– ప్రభాకర్రావు, ట్రాన్స్కో సీఎండీ
ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు
వొడితల రాజేశ్వరావు ప్రజల హృదయాల్లో నిలిచారు. పది మంది కోసం బతకాలనే ఆకాంక్షతో ముందుకు నడిచి, తన కు టుంబాన్ని నడిపించిన మ హానీయుడు. వొడితలకు టుంబం తెలంగాణ ప్రజలకు అంకితమైన కుటుం బం. ప్రతి వ్యక్తిని తన సొం త వ్యక్తిగా భావించి సాదక బా ధకాలు తెలుసుకొని, అడగకుండనే బాదలు తీర్చిన మహానీయుడు రాజేశ్వరావు. కవులు, కళాకారులను అదరించడంలో ముందునిలిచిన మహానాయకుడు.
– రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే
క్రమశిక్షణకు మారుపేరు
క్రమశిక్షణకు మారు పే రుగా మా తాత వొడితల రాజేశ్వరావు. ఆయన నాకు అదర్శం. ఎవరైన సహాయం కోసం వస్తే ఉ న్నవారా..? లేనివా రా..? అని చూడకుండా తనకు చేతనైనా సహా యం చేసే గొప్ప వ్యక్తి. ఊరు పేరే ఇంటి పేరుగా మార్చుకొని తెలంగాణ ప్రాంతాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువచ్చిన రాజేశ్వరావు విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప పుణ్యంగా భావిస్తున్న.
– వొడితల ప్రణవ్బాబు, రాజేశ్వరావు మనవడు, విగ్రహానిర్మాణ కర్త