జగిత్యాల/జగిత్యాల రూరల్, డిసెంబర్ 4: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7న జగిత్యాల జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్పర్సన్ వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ జీ రవి, ఎస్పీ సింధూశర్మతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా ప్రభుత్వ శాఖలు తమకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని, ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, టూర్ పూర్తయ్యేదాకా విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్కో అధికారులు చూడాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు సకాలంలో పాస్లు అందజేయాలని సూచించారు.
అలాగే ఫైరింజన్లు, అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్లు మందా మకరంద్, బీఎస్ లత, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ కలిసి మోతె గ్రామంలో సభాస్థలాన్ని సందర్శించి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాల రాకపోకల మార్గాలు, పారింగ్ ప్రదేశాలను పరిశీలించారు.