కరీంనగర్ కార్పొరేషన్/ కొత్తపల్లి నవంబర్ 7 : కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సం క్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం క రీంనగర్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ఆధ్వర్యంలో రూ.1.64 కోట్లతో కొనుగోలు చేసిన రెండు ఆటోమెటిక్ స్వీ పింగ్ మిషన్లను ప్రారంభించారు. అనంతరం స్మార్ట్సిటీ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇతర అభివృద్ధి పనులు, గ్రామీణ నీటిసరఫరాపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. తర్వా త కేబుల్బ్రిడ్జి పనులను పరిశీలించి, కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి తొలిమెట్టు, సీఎం కేసీఆర్ మెచ్చిన కరీంనగర్ను స్మార్ట్సిటీ పనులతో అద్భుతంగా మార్చాలన్నా రు. జిల్లాపై ప్రత్యేక అభిమానంతో సీఎం కేసీఆర్ కరీంనగర్ అభివృద్ధి కోసం మాత్రమే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం నుంచి జీవో నంబర్ 4ను జారీ చేయించారని గుర్తు చేశారు. అంతటి మహోన్నత స్థానం ఉన్న నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.
జిల్లాను పరిశుభ్రంగా ఉంచాలని ఆటోమెటిక్ స్వీపింగ్ మిషన్లను తీసుకువచ్చినట్లు చెప్పారు. అద్భుత నగరంగా మార్చే క్రమంలో భాగంగానే మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి తీసుకువచ్చినట్లు తెలిపారు. రూ.69 కోట్లతో వాటర్ పౌంటేన్ల ఏర్పాటుకు టెండర్లను పిలిచామన్నారు. నగరాభివృద్ధిలో ఉద్యోగులు సేవాభావం తో పని చేయాలని సూచించారు. జిల్లాలో ల్యాం డ్ అక్విజిషన్ పూర్తయిన చోట అక్రమ నిర్మాణా లు, పంటలు వేయకుండా చూడాలన్నారు. స్మార్ట్సిటీ పనుల్లో భాగంగా కమాన్ నుంచి హౌసింగ్బోర్డుకాలనీ వరకు సమస్యలను పరిష్కరించి రోడ్డు పనులను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 10 చోట్ల అత్యాధునిక హంగులతో ఐ లాండ్స్ను సుందరీకరిస్తామని చెప్పారు. ఇందు లో పచ్చదనం, వాటర్ఫాల్స్కు ప్రాధాన్యం ఇచ్చి ఈ నెల 15లోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. స్మార్ట్సిటీ పనుల్లో ఆటంకాల ను తొలగించాలని ఆదేశించారు. మానేర్ డ్యాం పై వెలుగకుండా ఉన్న లైట్లను పునరుద్ధరించాలని, కమాన్ నుంచి పాస్పోర్టు ఆఫీసు, నాకా చౌరస్తా నుంచి బొమ్మ వెంకన్న బంగ్లా మీదుగా రాజా థి యేటర్ టాకీస్ వరకు స్మార్ట్సిటీ రోడ్డు పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. మలాపూర్ డీ 94 కెనాల్కు గండి పడుతున్నందున చర్యలు తీసుకోవాలని, కొత్తపల్లి మెయిన్ రోడ్డు, కొకెరకుంట వరకు అభివృద్ధి పనులను, రేకుర్తి నుంచి వెలిచాల ఎక్స్రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ప్రణాళికను రూపొందించాలని సూచించారు. డి సెంబర్ 31 నాటికి కేబుల్ బ్రిడ్జి అప్రోచ్రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
తరుగు పేరిట ఇబ్బందులు పెడితే చర్యలు
తరుగు పేరిట ధాన్యంలో కోతలు విధించి ఇ బ్బందులు కలుగజేసే రైస్మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంగుల హెచ్చరించారు. అధికారులు, రైస్మిల్లర్లు జోడెడ్ల బండిగా కలిసి సాగినప్పుడే రైతులకు ఇబ్బందులు రావని సూ చించారు. ప్రొక్యూర్మెంట్ సజావుగా జరగాలని, అన్లోడింగ్లో ఆలస్యం కాకుండా చూడాలన్నారు. ఆరోపణలకు ఆసారం లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించి, రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు గిట్టుబాటు ధర అం దుతుందని చెప్పారు. కేంద్రాల నిర్వాహకులు వెం టనే లారీలు, ఇతర వాహనాల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు పంపించాలన్నారు. రేపటి నుంచి అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు అందుబాటులో ఉంటాయని, ధాన్యం తరలింపులో జాప్యం చేయవద్దన్నారు. రైతులు దళారులను నమ్మిమోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై.సునీల్రావు, సుడా చైర్మ న్ జీవీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్లాల్, గరిమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొ న్నం అనిల్ గౌడ్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, జడ్పీటీసీ కరుణ, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఎండీ ఫక్రుద్దీన్, కౌన్సిలర్లు వాసాల రమేశ్, జేరిపోతుల మొండయ్య, మానుపాటి వేణుగోపాల్, గండు రాంబాబు, నాయకులు వేముల శేఖర్, ఎస్కే బాబా, స్వర్గం నర్సయ్య, శ్రీకాంత్, కట్ల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.