కార్పొరేషన్, నవంబర్ 13: తెలంగాణను దోచుకునేందుకు ఢిల్లీ పాలకులు, ఆంధ్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. నగరంలోని రాంనగర్, టవర్సరిల్ ప్రాంతాల్లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఢిల్లీ, ఆంధ్ర పాలకులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా మా లక్ష్యం అభివృద్ధి అని స్పష్టం చేశారు.
స్వరాష్ట్రంలో కరీంనగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. విశాలమైన రోడ్లు, అందమైన కూడళ్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు పేరొన్నారు. రోడ్లను శుభ్రంగా ఉంచేందుకు ఆటోమేటిక్ స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. అసంపూర్తి రోడ్లను త్వరలో పూర్తి చేస్తామని, 50 ఏళ్లలో జరుగని అభివృద్ధిని తొమ్మిదేళ్లలో చేసి చూపించామన్నారు. కరీంనగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పరిపాలన అందిస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక పాదయాత్రలు, కోతి చేష్టలతో ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ఆంధ్ర పాలన మళ్లీ అవసరమా అని ప్రశ్నించారు. వారి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, వంగల శ్రీదేవి-పవన్కుమార్, గుగ్గిళ్ల జయశ్రీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాసా కిట్లు పంపిణీ
వావిలాలపల్లిలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు మంత్రి గంగుల కమలాకర్ నాసా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు చకగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం లక్ష్మణరావు, రీజినల్ ఇన్చార్జి రాజు, కో-ఆర్డినేటర్ ప్రవీణ్, ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డి, డీన్ శ్రీధర్, ఏవో కిషన్రెడ్డి, సుధీర్, సందీప్, విద్యార్థులు పాల్గొన్నారు.