కార్పొరేషన్, జనవరి 6 : కరీంనగర్ నగరపాలక సంస్థ వాటర్ ప్లస్ హోదా దకించుకోవడం గర్వకారణమని మేయర్ యాదగిరి సునీల్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు. పాలకవర్గ సభ్యులు, పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి మేయర్, కమిషనర్ స్వీట్లు తినిపించారు. కార్మికులకు మేయర్ పూల మొక ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలు, పాలకవర్గ సహకారం, పారిశుధ్య కార్మికులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఉత్తమ ఆవార్డులు, హోదాలు దకుతున్నాయని తెలిపారు.
పాలకవర్గం, అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యేలు కేటీఆర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రశంసించారని, ప్రత్యేక అభినందనలు తెలిపారని చెప్పారు. అన్ని కేటగీరిల వారీగా పారిశుధ్య వ్యవస్థను మొరుగుపరిచినందుకే వాటర్ హోదా వచ్చిందన్నారు. గతంలోనే ఓడీఎఫ్, ఓడీఎఫ్+, ఓడీఎఫ్++ రావడంతోపాటు సఫాయి మిత్ర సురక్షా చాలెంజ్లో దేశంలో మంచి ర్యాంకు సాధించి రూ.4 కోట్ల ప్రైజ్ మనీ పొందినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు వాటర్ ప్లస్ రావడం గొప్ప విషయమన్నారు. ఇంత మంచి హోదా దకడానికి మా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అప్పటి కలెక్టర్, అదనపు కలెక్టర్ల సహకారం ఉందని కొనియాడారు.
రాబోయే రోజుల్లో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఎస్టీపీకి అనుసంధానం చేసి 99 శాతం మురుగు నీరు శుద్ధీకరణ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. డంపింగ్ యార్డు సమస్య నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి లభిస్తుందని, 24 గంటల మంచి నీటి సరఫరా ప్రాజెక్టు ట్రయల్న్ ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, బుచ్చిరెడ్డి, దిండిగాల మహేశ్, బోనాల శ్రీకాంత్, ఎదుల్ల రాజశేఖర్, బండారి వేణు, భూమాగౌడ్, కుర్ర తిరుపతి, ఆకుల నర్మద నర్సయ్య, తుల రాజేశ్వరి బాలయ్య, సల్ల శారద రవీందర్, వంగల శ్రీదేవి పవన్, లెకల స్వప్న వేణు, సానిటేషన్ సూపర్ వైజర్ రాజమనోహర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామి పాల్గొన్నారు.