వేమువాడ రూరల్, నవంబర్ 18 : రైతులకు, ప్రభుత్వానికి వారధిగా మార్కెట్ కమిటీ పాలకవర్గం పనిచేయాలని, మెరుగైన సేవలందించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. వేములవాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి మాట్లాడారు. మర్రిపెల్లి వద్ద కొత్తగా 12 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణానికి ఇప్పటికే స్థల సేకరణ జరిగిందని, త్వరలోనే భూమిపూజ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్లోని రెండెకరాలను సమీకృత మార్కెట్కు కేటాయించామన్నారు. ఎల్లంపల్లి ద్వారా 55 వేల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో కలికోట సూరమ్మ చెరువు ద్వారా 45 వేల ఎకరాలు, మల్కపేట రిజర్వాయర్, నిమ్మపల్లి ప్రాజెక్టు స్థిరీకరణతో కోనరావుపేట మండలంలో మరో 20వేల ఎకరాలు సాగులోకి రానున్నాయన్నారు. నియోజకవర్గంలో మొత్తం లక్షా20వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
తెలంగాణ వస్తే ఏమి వచ్చిందంటున్న వారికి నాడు ప్యాక్స్ సెంటర్లలో 3వేల క్వింటాళ్ల ధాన్యం కొంటే, ఇప్పుడు 3 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేయడమే సమా ధానమని చెప్పారు. కరీంనగర్ డెయిరీ సహకార సంఘం ఎన్నో అద్భుతమైన ఫలితాలను సాధించిందని, 5వేల లీటర్లతో ప్రారంభమైన డెయిరీ నేడు 2 లక్షల లీటర్ల పాల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నదంటే అది సహకార సంఘాల ద్వారానే సాధ్యమన్నారు. రానున్న సెస్ ఎన్నికల్లో మంచి పాలకవర్గాన్ని ఎన్నుకుందామని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్రావు, జడ్పీచైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీ బూర వజ్రమ్మ, ఎదురుగట్ల చంద్రయ్య, జడ్పీటీసీ మ్యాకల రవి, ఏశ వాణి, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు కట్కం మల్లేశం, జడల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొస్కుల రవి, ఊరడి ప్రవీణ్, రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పాలకవర్గ సభ్యులు వీరే..
మార్కెట్ కమిటీ చైర్మన్గా మిర్యాల ప్రభాకర్రావు (మామిడిపల్లి), వైస్ చైర్మన్గా వెల్మబాల్రెడ్డి (చెక్కపల్లి) ప్రమాణ స్వీకా రం చేశారు. వీరితోపాటు డైరెక్టర్లుగా బండా రి శ్రీనివాస్ (సంకెపల్లి), గుండెకార్ల నరేశ్ (ఆరెపల్లి), పల్లపు లక్ష్మణ్ (నాంపల్లి), ఫీర్ మహ్మద్ (వేములవాడ), తీగల దేవరాజు (మల్లారం), వుచ్చిడి రాజిరెడ్డి (నిజామాబాద్), దుంపటపల్లి రాజేశం (మరిమడ్ల), ఇస్లావత్ రవీందర్ (నిమ్మపల్లి), పెండ్యాల శంకర్ (నూకలమర్రి), పసుల జ్యోతి (హన్మాజీపేట), చేపూరి రవీందర్ (వేములవాడ ) జీ కమలాకర్రెడ్డి (వేములవాడ), మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి (వేములవాడ) వేములవాడ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి (వేములవాడ) ప్రమాణం చేశారు.