మహాశివరాత్రి వేడుకలను శనివారం జిల్లాలో ఘనంగా జరుపుకొన్నారు. భక్తులు గరళకంఠుడైన శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివలింగానికి అభిషేకాలు చేశారు. పలుచోట్ల అంగరంగ వైభవంగా జరిపించిన శివపార్వతుల కల్యాణాన్ని తిలకించి పులకించిపోయారు.
జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మండలి విప్ కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ వై సునీల్రావు, తదితరులు శివాలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.