మోదీ సర్కారు పెంచిన వంటగ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోరు బాట పట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో నిరసనలు చేపట్టారు. పలుచోట్ల కేంద్రం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఖాళీ సిలిండర్లను ప్రదర్శించారు. రోడ్లపై కట్టెల పొయ్యి పెట్టి వంటావార్పు నిర్వహించారు. ‘మోదీ డౌన్ డౌన్.. అచ్చే దిన్ కాదు సచ్చేదిన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పెంచిన గ్యాస్ రేటు తగ్గించేదాకా పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు.
చొప్పదండి, మార్చి 2: కేంద్ర ప్రభుత్వం తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను తరచూ పెంచుతూ సామాన్యుల నడ్డి విరిచేలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ మినుపాల తిరుపతిరావు, సర్పంచ్ గుంట రవి, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, కొత్తూరి మహేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు పాషా, నాయకులు నలుమాచు రామకృష్ణ, బందారపు అజయ్కుమార్గౌడ్, మాచర్ల వినయ్కుమార్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బత్తిని సంపత్, మహేశుని మల్లేశం, వడ్లకొండ శ్రీనివాస్, యువరాజు, జహీర్, చీకట్ల లచ్చయ్య, కొత్తూరి నరేశ్, బాలకిషన్, గన్ను శ్రీనివాస్రెడ్డి, మావురం మహేశ్, నందిరెడ్డి, మామిడి రాజేశం తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, మార్చి 2: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తరచూ గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ ప్రజలకు గుదిబండగా మారిందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు పేర్కొన్నారు. మండలంలోని మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారిపై ఖాళీ సిలిండర్లతో రాస్తారోకో, నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై కట్టెల పొయ్యి వెలిగించి వంటావార్పు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మేచినేని నవీన్రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు వేముల దామోదర్, రాసూరి మల్లేశం, పొట్టల కనకయ్య, జోగు లక్ష్మీరాజం, తోట వేదాంతి, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు వేముల అంజి, రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, అలువాల తిరుపతి, వడ్లూరి ఆదిమల్లు, తాళ్ల సురేశ్, తోట మహిపాల్, నిమ్మనవేణి ప్రభాకర్, పెంచాల చందు, గుండవేణి తిరుపతి, మామిడిపెల్లి అఖిల్, గంగాధర వేణు, మ్యాక వినోద్, గంగాధర శ్రీకాంత్, ఎడవెల్లి ప్రవీణ్, ద్యావ సంజీవ్, గంగాధర రఘు, సముద్రాల ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, మార్చి 2: మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్రావుపేట ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్రెడ్డి, డైరెక్టర్లు బత్తిని తిరుపతిగౌడ్, గడ్డం మోహన్రావు, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బండ అజయ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, లంక మల్లేశం, ఎడవెల్లి మల్లేశం, ఆరపెల్లి ప్రశాంత్, శనిగరపు అర్జున్, ఎండీ మొయిజ్, పెంటి శంకర్, రాజమౌళి, మధురెడ్డి, కిరణ్, రవి, లచ్చయ్చ, భీమనాథుని శారద, తదితరులు పాల్గొన్నారు.
అల్గునూర్ చౌరస్తాలో..
కమాన్చౌరస్తా, మార్చి 2: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై కట్టెలు పెట్టి వంట చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సల్ల శారద-రవీందర్, పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ వీరారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు జాప శ్రీనివాస్ రెడ్డి, సల్ల మహేందర్, పరశురాములు, ఆంజనేయులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సభ్యుడు ఆంజనేయులు, జలపతి తదితరులు పాల్గొన్నారు.
వామపక్షాల ఆధ్వర్యంలో..
తెలంగాణచౌక్, ఫిబ్రవరి 2: సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవా రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణచౌక్ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వర్ణ వెంకటరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, ఎడ్ల రమేశ్, శనిగరపు రజినీకాంత్, గజ్జల శ్రీకాంత్, అరవింద్ పాల్గొన్నారు. అలాగే, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్, కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని పార్టీ కార్యాలయం నుంచి ఊరేగింపుగా కమాన్చౌరస్తా వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొయ్యడ సృజన్కుమార్, బోయిని అశోక్, పైడిపల్లి రాజు, పద్మ, మల్లమ్మ, మచ్చ రమేశ్ పాల్గొన్నారు.