జమ్మికుంట, జూన్ 3: ‘రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం. అందు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు’ అని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి పే ర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా రెండోరోజు ఆబాది జమ్మికుంట, మడిపల్లి, బిజిగిరిషరీఫ్, తనుగుల, వావిలాల క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల్లో ఘనంగా రైతు సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సి బ్బంది, రైతులు, స్థానిక ప్రజలు ఎడ్ల బండ్లు కట్టా రు. ర్యాలీ తీశారు. తెలంగాణ నినాదాలు చేశారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలను ఫ్లకార్డులు పట్టుకుని నినదించారు. ఆయా వేదికల్లో సమావేశాలు నిర్వహించుకున్నారు. కాగా, ఆబాది జమ్మికుంట రైతు వేదికలో నిర్వహించిన రైతు సదస్సుకు కౌశిక్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాకముందు కరెంటు లేకుండా ఉండేదని, పంటలు పండించుకునేందుకు రైతులు ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. తెలంగాణ ఆవతరణ తర్వాత సీఎం కేసీఆర్ 24గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని, రైతు బీమా, రైతు బంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూములన్నీ పచ్చని పొలాలుగా మారిపోయాయని, ఎస్సారెస్పీ నిండుకుండలా ప్రవహిస్తున్నదని చెప్పారు. పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయిస్తున్నదని తెలిపారు. మిషన్ కాకతీయతో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్తో రైతు సమస్యలన్నీ తీరాయని వివరించారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. ఏఈవోలతో పంటల సాగుకు దన్నుగా నిలుస్తున్నారని తెలిపారు. త్వరలో రైతులకు పంట రుణమాఫీ కూడా చేసే దిశగా సీఎం ఆలోచిస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ కవ్వింపు చర్యలు..
రైతు సదస్సులో మండలి విప్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆబాది జమ్మికుంటకు చెందిన రైతు, కాంగ్రెస్ నాయకుడు బుర్ర కుమార్, విప్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. రుణమాఫీ, పంట నష్టం, కొనుగోళ్ల ఇబ్బందులు, తదితర అంశాలను ప్రశ్నించాడు. దీనికి మండలి విప్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా రైతులను ఆదుకుంటున్నారా..? తెలంగాణలో అందించే పథకాలు అమలు చేస్తున్నారా..? చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బంధు, రైతు బీమా, కొనుగోళ్లు, పింఛన్లు, విద్య, వైద్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు సీఎం అందిస్తున్నారని చెప్పారు. సిగ్గు, శరం ఉంటే.. అక్కడి రాష్ర్టా ల్లో అమలు చేయాలన్నారు.
చిన్నచిన్న సమస్యలను భూతద్దంలో చూడొద్దని హితవు పలికారు. తర్వాత పలువురు రైతులు సదరు కాంగ్రెస్ నాయకుడిని తిట్టిపోశారు. రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పట్టణ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు రైతులను శాంతింపజేశారు. దీంతో గొడవ సద్దుమనిగింది. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్ శ్రీనివాస్, ఎంపీపీ మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, ఏడీఏ సునీత, ప్రత్యేకాధికారులు, మండలాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.