వేములవాడ టౌన్, జనవరి 22: రాజన్న క్షేత్రం సోమవారం కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మందితో పోటెత్తింది. ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో ఎటూ చూసినా రద్దీ కనిపించింది. మేడారం జాతరకు వెళ్లేవారు మొదట రాయేశుడిని దర్శించుకోవడం ఆనవాయితీ కాగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ధర్మగుండంలో స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. 3 గంటల పాటు క్యూలో నిల్చొని దర్శించుకున్నారు.
అనంతరం రాజన్నకు కోడె మొక్కు తీర్చుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకే సుమారు 60 వేలకు పైగా భక్తులు రాజన్నను దర్శించుకున్నారని, దాదాపు 32 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్యవేక్షకులు తిరుపతిరావు, అల్లి శంకర్, ఇన్స్పెక్టర్లు సంకెపల్లి పవన్కుమార్, చెక్కిళ్ల అశోక్, శ్రీనివాస్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.