మారుతీనగర్, జనవరి,19 : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. ఈ మేరకు శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా తరగతి గదులతోపాటు భోజనశాల, వంటగదులను పరిశీలించారు. పాఠశాలల్లో అడ్మిషన్ల విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రిన్సిపాల్ సంతోషినికి సూచించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.