కోరుట్ల, జూన్ 11: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన మౌలిక ఏర్పాట్లు, విద్యార్థులకు సౌకర్యాలు, తరగతుల నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై చర్చించారు. నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యేను విద్యాశాఖ అధికారులు సత్కరించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నారాయణ, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల విద్యాధికారులు గంగుల నరేశం, కనకతార, దామోదర్రెడ్డి, మధు, తదితరులు పాల్గొన్నారు.