ధర్మారం, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు -మన బడి’తో సర్కారు బళ్లు కార్పొరేట్కు దీటుగా రూపొందాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మంగళవారం ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవంలో పాల్గొన్నారు. మొదట కటికనపల్లిలో మంత్రికి సర్పంచ్ కారుపాకల రాజయ్య, టీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీతో, మహిళలు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలోని భారతమాత విగ్రహానికి మంత్రి పూలమాల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దాకా భారీ ర్యాలీతో మంత్రి చేరుకున్నారు. అనంతరం మన ఊరు మనబడి కార్యక్రమంలో 28 లక్షల నిధులతో పూర్తయిన పాఠశాలలో చేపట్టిన నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. ఇక్కడ 32 మంది మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ధర్మారంలో పర్యటించగా సర్పంచ్ పూస్కూరు జితేందర్ రావు ఆధ్వర్యంలో జడ్పీ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ పినుమల్ల ఛాయాదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మంత్రికి కోలాటాలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పాఠశాలలో ‘మన ఊరు -మనబడి’ ద్వారా 26.39 లక్షల నిధులతో చేపట్టిన డైనింగ్ హాల్, డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు.
డిజటల్ సైన్స్ గదిని ప్రారంభించి విద్యార్థులతో కలిసి వీక్షించారు. బోర్డుపై సైన్ చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో 27.96 నిధులతో చేపట్టిన ప్రహరీ నిర్మాణం, ఇతర నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. సమైక్య పాలనలో ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతులు లేక నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. తరగతి గదులు లేక విద్యార్థులు చెట్ల కింద చదువుకుని ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయని ఆయన గుర్తు చేశారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మనబడి’తో పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 30శాతం పాఠశాలలను మొదటి విడుతలో ఎంపిక చేసి 7,729 కోట్ల నిధులను కేటాయించారని తెలిపారు. ఎంపికైన పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించి ఆధునీకరించారని వెల్లడించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరడంతో సరారు బడులు కళకళలాడుతున్నాయన్నారు. తల్లిదండ్రులు కూ డా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పం పించి నాణ్యమైన విద్యను పొందేలా చూడాలని సూచించారు. నేడు రాష్ట్రంలో 1,006 గురుకుల విద్యాలయాలు ఉండడం ఎంతో శుభ పరిమాణమన్నారు. గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన బోధన అందించడంతో వేలాది మంది విద్యార్థులు చేరేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారన్నారు. గౌరీ దొడ్డి గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు గతేడాది 108 మంది ఎంబీబీఎస్లో సీట్లు సాధించారని, ఈ యేడాది అదే కళాశాలకు చెందిన విద్యార్థులు 218 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించడం గురుకులాలో నాణ్యమైన విద్యా బోధనకు నిదర్శనమని పేరొన్నారు.
కటికనపల్లిలో సుమారు 3కోట్లతో గ్రామం సర్వతోముఖాభివృద్ధి జరిగిందని, ఈ క్రమంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఏర్పడి పదిలక్షల అవార్డును సాధించడం ఎంతో శుభ పరిమాణం అని సర్పంచ్ కారు పాకల రాజయ్యను మంత్రి అభినందించారు. ఎస్ఎంసీ చైర్మన్ ఖాసిం విద్యార్థులను ఇతర ప్రాంతాల నుంచి తరలించేందుకు తన ఆటోను సమకూర్చి సహకరించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఎల్ఎం కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా పలువురు విద్యార్థులకు సూల్ బ్యాగులను మంత్రి ఈశ్వర్ అందజేశారు. ధర్మారం జడ్పీ ఉన్నత పాఠశాలలో గతేడాది పదిలో టాపర్గా నిలిచిన విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్తోపాటు కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులను పాఠశాల హెడ్మాస్టర్ ఛాయాదేవి సన్మానించారు. విద్యార్థులు చేసిన సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సమావేశాలకు కటికనపల్లి, ధర్మారం సర్పంచులు కారుపాకల రాజయ్య, పూస్కూరు జితేందర్ రావు అధ్యక్షత వహించారు. ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీ సభ్యురాలు పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాం రెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, ఎంపీడీవో జయశీల, విద్యా శాఖ అధికారులు, ఎంపీఓ రమేశ్, ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు పినుమల్ల ఛాయాదేవి, మడ్డి కొమరయ్య, మల్లారెడ్డి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ఉప సర్పంచులు రామడుగు గంగారెడ్డి, ఆవుల లత, జీపీ కార్యదర్శులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పార్టి మండల అధికార ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, ధర్మపురి శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి దేవస్థానం బోర్డు డైరెక్టర్ జైన రాజమౌళి, డీఆర్డీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.