ధర్మపురి, ఆగస్టు 2: ‘సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ధాన్యపు రాశులతో అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కింది. కానీ, మోదీ పాలనలో మన దేశం ఆకలికేకలకు నిలయంగా మారింది’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, దివ్యాంగులు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం సిద్ధించకముందు వ్యవసా యం ఎట్లున్నదో.. ఇప్పుడు ఎట్లున్నదో తేడాను గమంచాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పాటైన సందర్భంలో శాపనార్థాలు పెట్టిన ఆంధ్రాప్రాంతం వారే ప్రస్తు తం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. ధర్మపురిలో బుధవారం మంత్రి పర్యటించారు. 6.63 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ధర్మపురిలో 4 కోట్లతో నిర్మించిన సమీకృత మారెట్, 13 లక్షలతో చేపట్టిన బస్తీ దవాఖాన, 25 లక్షలతో నిర్మించిన పశువైద్యశాలను ప్రారంభించారు.
2 కోట్లతో దొంతాపూర్లో సబ్స్టేషన్, 25 లక్షలతో ధర్మపురిలో పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ ప నులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మపురికి చెం దిన స్వాతంత్య్ర సమరయోధులు కేవీ కేశవులు, సంగనభట్ల మాణిక్యశాస్త్రీ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, విగ్రహాల ఏర్పాటు, అమరవీరుల స్థూనం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ మనరాష్ట్రంలో అమలవుతున్న 24 గంటల కరెంట్, రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలు బీజేపీ పాలిత రా ష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదో ఆ పార్టీ నాయకులు చెప్పాలని ప్రశ్నించారు. చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్, బీజేపీ నేతల పాచికలు పారబోవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అరవైఏండ్ల పాలనలో కరెంట్లేక, సాగునీరందక పంటలు ఎండిపో యే పరిస్థితులు కనిపించేవాన్నరు.
జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అనివార్యమైపోయాయని, కానీ తెలంగాణలో కనుమరుగయ్యాయని చెప్పారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని, కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రభుత్వం విద్యుత్ రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించిందన్నారు. నేడు పరిశ్రమలు, గృహాలు, సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రా ష్ట్రం మనదేనని చెప్పారు. ఉచిత కరెంట్కు సర్కారు ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ప్ర ధాని సొంతరాష్ట్రం గుజరాత్లో పవర్హాలిడేలు ప్రకటిస్తుంటే, తెలంగాణలో మాత్రం ఈ ఊసే లేదన్నారు. ము ఖ్యమంత్రి అయిన తర్వాత రాష్టానికి కేసీఆర్ ఏమి చేసిం డో, మోదీ ప్రధాని అయిన తరువాత దేశానికి ఏమి చేసిండో ప్రజలు గుర్తించారని కోరారు.
గుడికి, మసీద్కు పంచాయితీ పెట్టి బతుకున్న పార్టీ బీజేపీయేనని ఎద్దేవా చేశారు. కానీ సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పరితపిస్తున్నారని చెప్పారు. ధర్మపురికి వరద ముప్పు తప్పించేందుకు కరకట్ట నిర్మిస్తామని తెలిపారు. ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ధ ర్మపురి రూపురేఖలు మారిపోయాయన్నారు. సమీకృత మారెట్ను అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. ఉమ్మడి పాలనలో మురికికూపంలా మా రిన చింతామణి చెరువును స్వరాష్ట్రంలో రూ.1.30 కోట్లు వెచ్చించి సుందీరకరించకున్నామన్నారు. అలాగే ధర్మపురిని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసుకున్నామని చెప్పారు. కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టిందని చెప్పారు. ఎస్పీ భాస్కర్, కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తె మ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, ఆర్బీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ సౌళ్ల భీమయ్య, ఏఎం సీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న,కౌన్సిలర్లు సయ్యద్ యూనుస్, వేణు, అశోక్, అనంతుల విజయలక్ష్మి, వొడ్నాల ఉమాలక్ష్మి ఉన్నారు.