కేసీఆర్ సర్కారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసింది. పదేండ్లలో సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలాచోట్ల నీటి కటకట మొదలైంది. వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాలు, తండాల్లో ప్రజలు తాగునీటి కోసం పొలాలు, బోరుబావుల వద్దకు బారులు తీరుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం పడిన కష్టాలు మళ్లీ కొద్దిరోజుల నుంచి మొదలయ్యాయని లొద్దితండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ముందే నల్లానీళ్లు పట్టుకుని పరిస్థితి నుంచి పొలాల వద్దకు పరుగులు తీయాల్సిన దుస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు.
– ఎల్లారెడ్డిపేట/ వీర్నపల్లి, ఏప్రిల్ 7