హుజూరాబాద్టౌన్, అక్టోబర్ 20: ఎన్నికల్లో హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండానేనని, ఈ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. అధినేత కేసీఆర్ తెచ్చిన మ్యా నిఫెస్టోను చూసి ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెం చరీ చేస్తుందని, బీజేపీ డక్ ఔట్ అవుతుందని, అలాగే కాంగ్రెస్ రన్ ఔట్ అవుతుందని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్గా నిలిచిందని పేర్కొన్నారు. హుజూరాబాద్ సిటీ సెంటర్లో శుక్రవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి పేదల బతుకుల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు.
ఈటల రాజీనామా చేసిన తర్వాత హుజూరాబాద్లో 300 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, సైదాపూర్, సూపర్బజార్ రోడ్లను అద్భుతంగా నిర్మించుకున్నామన్నారు. 106 పంచాయతీల్లో మహి ళా, కుల సంఘాల భవనాలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ మహనీయుడిపై గౌరవాన్ని చా టారని చెప్పారు. దళితబంధు పథకం లబ్ధిదారు లు ఇప్పుడు నెలకు 30 వేల నుంచి 2 లక్షలు సంపాదించే స్థాయికి ఎదగడం గొప్ప విషయమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు 37 వేల కోట్ల రుణమాఫీ చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కీర్తించారు. కాళేశ్వరం నిర్మించి ప్రతి ఎకరాకు నీరందిస్తున్నారన్నారు. హుజూరాబాద్లో 2 వేల కోట్ల మేర సబ్సిడీ కరెంట్ ఇస్తున్నామన్నారు. ఈటల మళ్లీ గెలిచిన తర్వాత చేసిన పనులేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన్ను ఇ క్కడి ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని, ఇటీవల జమ్మికుంట బీజేపీ సభలో మాట్లాడుతుండగానే ప్రజలు వెళ్లిపోవడమే ఇందుకు నిదర్శమన్నారు.
నేను కోపంతో మాట్లాడుతానని, దురుసుగా ప్రవరిస్తున్నానని కొందరు గిట్టని వారు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కౌశిక్రెడ్డి ఆక్షేపించారు. తాను అలాంటి వ్యక్తిని కాదని, ఏదైనా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతానని స్పష్టం చేశారు. తాను కల్మషంలేని వ్యక్తినని, నటించడం తనకు చేతకాదని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న తన వ్యక్తిత్వం పై ప్రతిపక్షాల గోబెల్ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. హుజూరాబాద్ అభివృద్ధికి తాను ప్రత్యేక మ్యానిఫెస్టో రూపొందించానని తెలిపారు. గెలిచిన తర్వాత ఆచరణలోకి తెచ్చి హుజూరాబాద్ను సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో తీర్చిదిద్దుతానని ప్రకటించారు.
ప్రజలు పనిచేసే వారిని ఆదరించాలని కోరారు. అలాగే హుజూరాబాద్ నియోజకవ ర్గ ప్రజలకు, అకాచెల్లెళ్లకు, అన్నదమ్ములకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, ఎంపీపీ ఇరుమల్ల రాణీసురేందర్రెడ్డి, పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంగెం ఐలయ్య, కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్, మారేపల్లి సుశీల, ముక రమేశ్, ఉమామహేశ్వర్, రాష్ట్ర నేత వర్ధినేని రవీందర్రావు, నేతలు కోండ్ర నరేశ్, ఇమ్రాన్, కృష్ణ, పంజాల కుమారస్వామి, హన్మంత్గౌడ్, శ్రీనివాస్, గోపాల్రావు, భిక్షపతి, మైఖేల్, తిరుపతి, మధూకర్, వెంకటేశ్, కిషన్రెడ్డి, కొమురయ్య పాల్గొన్నారు.