హుజూరాబాద్, సెప్టెంబర్ 14: వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే హుజూరాబాద్లో మినీ కలెక్టరేట్ను నిర్మిస్తానని కౌశిక్రెడ్డి ప్రజలకు హామీ ఇస్తున్నాడు. పలు సభలు, సమావేశాలు, ప్రెస్మీట్లో ఆయన బహిరంగంగా ప్రకటిస్తుండడం విశేషం. మినీ కలెక్టరేట్ నిర్మాణం ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఈ డిమాండ్ ఉండేది. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతైన, తమ కోరిన నెరవేరుతుందని ప్రజలకు బలంగా విశ్వసించినా, అదీ అమలుకు నోచుకోలేదు.
ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి మినీ కలెక్టరేట్ నిర్మాణాన్ని తెరమీదకు తేవడంతో ప్రజల్లో ఆశలు చిగురుస్తున్నాయి. తనను ఎన్నికల్లో గెలిపిస్తే తప్పకుండా మినీ కలెక్టరేట్ నిర్మించి తీరుతానని ప్రజల ముందు ప్రతిపాదన పెట్టారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా పని చేస్తానని, ఒకే ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్తిస్థున్నాడు. ఇప్పటివరకు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటుగా ప్రజలకు అవసరమైనా అభివృద్ధి పనులు చేయడంతో కౌశిక్రెడ్డిపై ప్రజల్లో చాలా నమ్మకం పెరిగింది.
అన్ని కార్యాలయాలు ఒకేచోట
డివిజన్ కార్యాలయాలతో పాటుగా, ఎంపీడీవో, తహసీల్దారు, ఐకేపీ, వ్యవసాయశాఖ, విద్యుత్తు, రిజిస్ట్రేషన్, ఇతరాత్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్ని మినీ కలెక్టరేట్లో నిర్మాణం కానున్నాయి. ఇదే జరిగితే ప్రజలకు పనులు చాలా సులువుగా అయ్యే అవకాశాలుంటాయి. ఏడు ఎకరాల్లో మినీ కలెక్టరేట్ను నిర్మించేందుకు కౌశిక్రెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేశాడు. దీని కోసం ఎంపీడీవో కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు, విద్యుత్తు కార్యాలయాల నుంచి ప్రభుత్వ హాస్టళ్ల స్థలాలను సేకరించనున్నారు. ప్రస్తుతం ఎంపీడీవో, తహసీల్దారు, ఇంజినీరింగ్, వ్యవసాయశాఖ వంటి ఇతర కార్యాలయాలు శిథిలావస్థలో ఉండగా రిజిస్ట్రేషన్ వంటి పలు శాఖల కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటినన్నింటిని ఒకేచోట నిర్మిచేలా కౌశిక్రెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాడు.
ముమ్మరంగా అభివృద్ధి పనులు
ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాడి కౌశిక్రెడ్డి, ఇప్పటికే నియోజకవర్గంలో రూ. వందల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి తదితర పనులు నిర్వహించారు. ఇందులో భాగంగా రూ.30కోట్లతో నర్సింగాపూర్ నుంచి వీణవంక వరకు నాలుగు వరుసల రహదారి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా జమ్మికుంట ఆదర్శ డిగ్రీ కళాశాల, హుజూరాబాద్ హైస్కూల్ గ్రౌండ్ను మినీ స్డేడియాలుగా ఏర్పాటు చేయడానికి రూ.10కోట్ల నిధులను కౌశిక్రెడ్డి మంజూరు చేయించారు. ఈమేరకు ఇటీవలనే హుజూరాబాద్ హైస్కూల్ గ్రౌండ్ను మినీ స్డేడియంగా నిర్మించేందుకు పాడి కౌశిక్రెడ్డి భూమి పూజ చేశారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తా
వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తా. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అయిన మినీ కలెక్టరేట్ను తప్పకుండా నిర్మిస్తా. ఒకే ఒక అవకాశం ఇచ్చి చూడండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా. కేసీఆర్ నన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. మీ ఆశీర్వాదాలు తప్పకుండా కావాలి. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా. నన్ను గెలిపిస్తే నాకంటే పెద్దోళ్లకు తమ్ముడిగా, చిన్నోళ్లకు అన్నగా, పేద కుటుంబాలకు పెద్దకొడుకలా అండగా ఉంటాను. ఆడబిడ్డలకు సోదురుడిలా సేవ చేసుకుంటా.
– మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి