చొప్పదండి/ముకరంపుర/తిమ్మాపూర్ రూరల్/చిగురుమామిడి, ఏప్రిల్ 11: యాసంగిలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిరసన దీక్ష చేపట్టింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. వడ్లు కొనకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నిరసన దీక్షలో చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపల్ అధ్యక్షులు గుర్రం నీరజ-భూమారెడ్డి, రుద్ర రాజు, చొప్పదండి, కరీంనగర్ ఏఎంసీ అధ్యక్షులు ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, ఎలుక అనిత, పావనీగౌడ్, చీరాల స్వాతి, డైరెక్టర్లు పాల్గొన్నారు.