కరీంనగర్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : పంచాయతీల పన్నుల వసూళ్లలో కరీంనగర్ జి ల్లా లక్ష్యం దిశగా పయనిస్తున్నది. అధికారులు, పంచాయతీ కార్యదర్శుల కృషి ఫలితంగా ఈ సారి ఇప్పటివరకు 96.40 శాతం పన్నులు వ సూలు చేశారు. జిల్లాలో మొత్తం 313 గ్రామ పంచాయతీలు ఉంటే 263 వంద శాతం పన్ను ల వసూళ్లను సాధించడం విశేషం. కలెక్టర్ ఆదేశాల మేరకు డీపీవో వీరబుచ్చయ్య, ఎంపీఓ లు, పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన ప్రత్యేక కార్యాచరణతోనే ఇది సాధ్యమైనట్లు స్పష్టంగా తెలుస్తున్నది.
263 పంచాయతీల్లో సంపూర్ణం..
గతేడాది 124 పంచాయతీల్లో పంచాయతీల్లో అధికారులు వంద శాతం పన్నులు వసూలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వంద శాతం వసూళ్లు సాధించిన పంచాయతీల సంఖ్య 263కు పెరిగింది. చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, గన్నేరువరం, తిమ్మాపూర్, కొత్తపల్లి మండలాల్లోని అన్ని పంచాయతీలు ట్యాక్స్, నాన్ ట్యాక్స్లు వంద శాతం వసూలు చేశాయి. మిగతా మండలాల్లో కూడా కొన్ని ట్యాక్స్లు వంద శాతం పూర్తి చేస్తే మరి కొన్ని నాన్ ట్యాక్స్లు వంద శాతం పూర్తి చేశాయి. మార్చి నెలాఖరులో సాధించిన ప్రగతిని ఏప్రిల్లో కూడా పది, పదిహేను రోజుల పాటు కొనసాగించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జిల్లాలో వంద శాతం పన్నులు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..
96.40 శాతం వసూళ్లు..
జిల్లాలో 15 రూరల్ మండలాల పరిధిలో 313 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను లు, లైబ్రరీ సెస్లు గతేడాది బకాయిలు రూ. 5,82,759 కలుపుకుని రూ. 7,88, 11,035, ఇంటి నిర్మాణ అనుమతులు, నీటి పన్నులైన నాన్ ట్యాక్స్ కింద గతేడాది బకాయిలేమీ లేవు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,40,56,226 డి మాండ్ ఉంది. ఈ మొత్తం కలుపుకొని రూ. 9,49,62,613 ఉంది. ఇందులో ఇప్పటివరకు టాక్స్ రూపంలో రావాల్సిన పాత బకాయిల్లో రూ. 4,84,493, కొత్త డిమాండ్ ప్రకారం రూ. 7,70,06,184 వసూలయ్యాయి. నాన్ టాక్స్లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 1,40,56,226 చొప్పున మొత్తం రూ. 9,15,46,903 వసూలయ్యాయి. టాక్స్ల్లో పాత బకాయిలో రూ. 98,266, డిమాండ్లో రూ. 12,22,092, నాన్ టాక్స్లో రూ. 20,95,352 మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. ఇవన్నీ కలుపుకుంటే జిల్లాలో ఇంకా కేవలం రూ. 34,15,710 మాత్రమే వసూలు కావాల్సి ఉంది..
ఏ మండలంలో ఎంత శాతం..
చిగురుమామిడి, గంగాధర, గన్నేరువరం, కొత్తపల్లి, తిమ్మాపూర్ మండలాల్లోని అన్ని పంచాయతీలు టాక్స్, నాన్ టాక్స్ వసూలు వంద శాతం పూర్తి చేశాయి. కరీంనగర్ రూరల్లో టాక్స్లు 96.52, నాన్ టాక్స్లు 100 శాతం వసూలయ్యాయి. మానకొండూర్లో టాక్స్లు 96.41, నాన్ టాక్స్లు 100 శాతం, రామడుగులో టాక్స్లు 96.41, నాన్ టాక్స్లు 100 శాతం, ఇల్లందకుంట టాక్స్లు 97.52, నాన్ టాక్స్లు 100 శాతం, హుజూరాబాద్లో టాక్స్ 99.20, నాన్టాక్స్ 69.48 శాతం, జమ్మికుంటలో టాక్స్ 97.07, నాన్ టాక్స్లు 84.80 శాతం, శంకరపట్నం టాక్స్లో 98.19, నాన్ టాక్స్లు 100 శాతం, సైదాపూర్లో టాక్స్ 93.69, నాన్ టాక్స్లు 95.42 శాతం, వీణవంకలో టాక్స్లు 98.34, నాన్ ట్యాక్స్లు 100 శాతం వసూలు చేశారు. మొ త్తంగా జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా గ్రామ పంచాయతీలు పన్నులు వసూలు చేయడం విశేషం.
వంద శాతం పూర్తి చేస్తాం..
పంచాయతీల్లో పన్నుల వసూళ్లు ఈ నెలలో వంద శాతం పూర్తి చేస్తాం. మా అధి కారులు, కార్యదర్శులు ఇదే పనిలో ఉన్నా రు. మొదటి నుంచి ప్రణాళికాబద్దంగా వ సూలు చేస్తున్నాం. అందుకే ఇంతవరకు వ చ్చింది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి రోజు మండల పంచాయతీ అధికారులతో పర్యవేక్షణ జరుపుతుండడంతో పన్నుల వసూళ్లు ఈ స్థాయికి వచ్చాయి. ఇందుకు సహకరించిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలకు ప్రత్యేక ధన్యవాదాలు..
– వీరబుచ్చయ్య, కరీంనగర్ డీపీవో