వేములవాడ టౌన్, జూలై 27: వేములవాడ శ్రీ రాజరా జేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబు మంగళవారం దర్శించుకున్నారు. ఏఈవో సంకెపల్లి హరికిషన్ ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించా రు. ఈ సందర్భంగా రమేశ్బాబు స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత స్వామివారి మండపంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకు లు వేదమంత్రాలతో ఆశీర్వదించగా, ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారి వెం ట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు, నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, రామతీర్థపు రాజు, ఆలయ అధికారులు, తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం 61 సంవత్సరాల వయోపరిమితిని అమలు చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రమేశ్బాబుకు ఆలయ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి సత్కరించారు. ఇక్కడ ఆలయ ఉద్యోగుల సంఘం గౌర వాధ్యక్షుడు ఉపాధ్యాయుల చంద్రశేఖర్, కార్యదర్శి పెరుక శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు, ఏఈవో ప్రతాప నవీన్, పర్యవేక్షకులు నటరాజ్, గోలి శ్రీని వాస్, తిరుపతిరావు, అల్లి శంకర్, ఎడ్ల శివ, పురాణం వంశీ తదితరులు ఉన్నారు. అలాగే సంగీత నిలయంలో నృత్య కళానికేతన్ సభ్యులు ఎమ్మెల్యే రమేశ్బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్ల పోశెట్టి, గౌరవాధ్యక్షుడు సోమినేని బాలు, కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.