ధర్మారం,జూలై 22: గ్రామీణుల ఆరోగ్యానికి సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ దిశగా ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ద్వారా మెగా వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఆయన ధర్మారం మండలం చామనపల్లి, నందిమేడారం, బొట్లవనపర్తి గ్రామాల్లో పర్యటించారు. చామనపల్లి, నందిమేడారంలో 77 మంది వాన బాధితులకు ఒక్కొక్కరికీ 3,800 చొప్పున 2,96 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. నంది మేడారంలో ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ – ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సంస్థ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత, ప్రతిమ దవాఖాన సీఈవో రాంచందర్రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం 27 మందికి 1,00,116 చొప్పున, 27, 03,132 కల్యాణలక్ష్మి, 21 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 8,30 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. బొట్లవన పర్తిలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు.
పల్లెజనులకు కార్పొరేట్ వైద్యమందించే లక్ష్యంతో వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ని రుపేదలకు సేవలందించడం ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. కాగా మెగా వైద్య శిబిరంలో వ్యాధి నిర్ధార ణ తర్వాత అవసరమున్న వారికి ప్రతిమ దవాఖానలో ఉచితంగా శస్త్ర చికిత్సలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రతిమా దవాఖాన సేవలు అద్భుతమని ఆయన కొనియాడారు. తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్కు 12 ఏండ్ల నుంచి కొప్పుల స్నేహలత చైర్పర్సన్గా వ్యవహరిస్తూ సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ఈ క్యాంపులో 1,442 మందిని వైద్యులు పరీక్షించగా, 569 మందికి మందులు పం పిణీ చేశారు. కొప్పుల ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ తరగతులతో పాటు అనాథ యువతుల పెండ్లిళ్లకు సాయం చేస్తున్నామని చెప్పారు. ధర్మపురిలో ఇటీవల 1,150 మంది ఉద్యోగార్థులకు భోజనం సౌకర్యం ఏర్పాటు చేసి కోచింగ్ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో పాఠశాలలో చదువుతున్న 5 నుంచి 6 ఏండ్ల వయస్సు విద్యార్థులకు ‘దృష్టి’ పేరిట కంటి పరీక్షలు చేస్తామని చెప్పారు. మహిళలు బొట్లవనపర్తిలోని కుట్టుశిక్షణ కేం ద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూ రు పద్మజ, గ్రామ సర్పంచులు సామంతుల జానకి, దాసరి తిరుపతి, రెడపాక ప్రమీల, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు.