సిరిసిల్ల/కలెక్టరేట్/ సిరిసిల్ల టౌన్/ వేములవాడ రూరల్, నవంబర్ 29 : డబుల్ బెడ్రూం ఇండ్లను అత్యంత నిరుపేదలైన లబ్ధిదారులకే ఇస్తామని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అందిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే సంక్రాంతికల్లా లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోగా మంజూరు చేస్తామని, తరతమ భేదాలు లేకుండా లాటరీ పద్ధతిలో ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ‘డబుల్ బెడ్రూం ఇండ్లు’, ‘మన ఊరు మన బడి’ ప్రగతి పై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ఆ తర్వాత వేములవాడ మండలం అగ్రహారంలోని చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి, స్కూల్ బాగుందని కితాబునిచ్చారు.
వచ్చే సంక్రాంతి పండుగలోగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లాలో ఇండ్లు లేని నిరుపేదల లెక్కను శాస్త్రీయంగా తేల్చి, వివరాలను అందిస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మిగిలిన వారు ఉంటే సొంత జాగాలో ఇండ్లను నిర్మించుకునేందుకు వీలుగా సంతృప్త స్థాయిలో అందరికీ ఇండ్లను మంజూ రు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూం ఇండ్లు, మన ఊరు-మన బడి కార్యక్రమం పనుల పురోగతిపై జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
అత్యంత పారదర్శకంగా కేటాయించాలి
రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరైన మొత్తం 6886 డబుల్ బెడ్రూం ఇండ్లలో 3952 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా, 3447 ఇండ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. వీటిలో ఇప్పటికే 1394 ఇండ్లు పంపిణీ చేయగా, 1746 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ అనురాగ్ జయంతి మంత్రి కేటీఆర్కు తెలుపగా, పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్లను లాటరీ పద్ధతిలో అ త్యంత పారదర్శకంగా అర్హులకు కేటాయించాలని మంత్రి ఆదేశించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇండ్లు లేని అత్యంత నిరుపేదలకు మాత్రమే అందజేయాలన్నారు. ఇంకా ప్రారం భం కాని ఇండ్లను సాధ్యమైనంత త్వరగా గ్రౌం డింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన ఇండ్లు గ్రౌండ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలదేనని స్పష్టం చేశారు.
సంక్రాంతిలోగా స్కూళ్ల పనులు పూర్తిచేయాలి
‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను సంక్రాంతికల్లా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ జిల్లా విద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో ధనాలకోట రాధాకిషన్ మంత్రికి పనుల పురోగతిని వివరించారు. జిల్లాలో మొత్తం 516 ప్రభుత్వ పాఠశాలలు కాగా, వీటి లో 111 ఉన్నత, 336 ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. ‘మన ఊరు – మనబడి’ మొదటి విడుత కింద రూ.20 కోట్ల 38 లక్షలతో 172 పాఠశాలల్లో ఎలక్ట్రికల్, టా యిలెట్స్, అదనపు తరగతి గదులు, మేజర్, మైనర్ పనులు చేపట్టామన్నారు. ఇవి వివిధ దశల్లో ఉన్నాయని నివేదించారు.
మార్చిలోగా ప్రగతి నివేదికలు పెడుతాం
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వెంటనే దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను చేపట్టామని మంత్రి తెలిపారు. వైశాల్యం పరంగా రాజన్న సిరిసిల్ల చిన్న జిల్లా అయినా మిగతా జిల్లాలకంటే దీటుగా, మిన్నగా అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని తెలిపారు. ఆ రంగాల అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ప్రగతి నివేదికలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సిద్ధం చేస్తామన్నారు. రాబోయే మాసాంతంలోగా ఒక్కో రంగానికి సంబంధించి జిల్లాలో ఎంపిక చేసిన మండలంలో వేలాది మందితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రతి వ్యక్తికీ ప్రగతి నివేదిక కాపీలను అందజేస్తామని వివరించారు.
వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎందే
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రా ష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 200 గు రుకులాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 1000 కిపైగా ఏర్పాటయ్యాయని, ఈ ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. సీఎం ఆశీస్సులతో రాజన్నసిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారిందన్నారు. మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలను మంజూరు చేశామని చెప్పారు. వ్యవసాయ, పాలిటెక్నిక్ సహా అనేక కాలేజీలను ఏర్పాటు చేశామని, విద్యా ప్రమాణాలను పెంచే దిశలో కృషి చేస్తున్నామని తెలిపారు.
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద స్కూళ్లలో మౌలిక వసతులను పెంపొందించే పనులను చేపడతామని వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, పవర్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళాచక్రపాణి, రామతీర్థపు మా ధవి, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు బీ సత్యప్రసాద్, ఎన్ ఖీమ్యానాయక్, ఆర్డీవోలు టీ శ్రీనివాసరావు, పవన్కుమార్, మున్సిపల్ కమిషన ర్లు సమ్మయ్య, అన్వేష్, ఇంజినీర్లు శ్రీనివాసరెడ్డి, అమరేందర్రెడ్డి, కిషన్రావు, జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ, సర్పంచ్ రంగు సత్తమ్మ, ఎంపీటీసీ దేవరాజు పాల్గొన్నారు.