కరీంనగర్ సర్కిల్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూలేనివిధంగా విద్యుత్ బిల్లుల వసూళ్లలో దూసుకెళ్తున్నది. ఎన్పీడీఎసీఎల్ పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను డిమాండ్కు మించి 400.58 కోట్లు (102.70శాతం) రాబట్టి అగ్రస్థానానికి ఎగబాకింది. ఇప్పటికే నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాతో వినియోగదారుల మన్ననలు పొందుతున్న విద్యుత్ సంస్థ, అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో అరుదైన ఘనత సాధించి తనకు మరేవరూ సాటిలేదని నిరూపించింది.
– ముకరంపుర, మే 7
నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాతో వినియోగదారుల మన్ననలు పొందుతున్న విద్యుత్ సంస్థ బిల్లుల వసూళ్లలోనూ రికార్డు సృష్టించింది. 2022-23ఆర్థిక సంవత్సరానికి డిమాండ్కు మించి వసూళ్లను రాబట్టింది. అధికారులు, సి బ్బంది సమష్టి కృషి ఫలితంగా లక్ష్యాన్ని అధిగమించారు. ఉత్తర విద్యుత పంపిణీ సంస్థ పరిధిలోని జిల్లాల్లో కరీంనగర్ సర్కిల్ ముందు వరుసలో నిలిచి ప్రత్యేక గుర్తింపు సాధించింది.
జిల్లాలో పరిస్థితి ఇదీ
వరంగల్ కేంద్రంగా ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సర్కిళ్ల వారీగా విద్యుత్ను పంపిణీ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రతి సర్కిల్కు డిమాండ్ను నిర్దేశిస్తూ వినియోగించిన యూ నిట్లకు గాను వినియోగదారుల నుంచి చార్జీల రూపంలో ఈఆర్వోల ద్వారా బిల్లులను వ సూలు చేస్తున్నది. కరీంనగర్ సర్కిల్ పరిధిలో క రీంనగర్ టౌన్-1, టౌన్-2, రూరల్, గుండి, అ ల్గునూరు, హుజూరాబాద్, జమ్మికుంట ఈఆర్వోల ద్వారా బిల్లుల వసూలు ప్రక్రియ జరుగుతోంది.
సర్కిళ్లలో సర్వీసుల వివరాలు
స్వరాష్ట్రంలో ప్రభుత్వం విద్యుత్ సరఫరాపై దృష్టి సారించింది. నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అనువుగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో వాణిజ్య సర్వీసులతో పాటు పరిశ్రమలు, గృహ విద్యుత్ సర్వీసులు పెరిగాయి. వ్యవసాయ సర్వీసులు సైతం లక్ష దాటా యి. కరీంనగర్ సర్కిల్లో మొత్తం 5,36,229 స ర్వీసులు ఉన్నాయి. అందులో 3,69,212 గృహ, 1,00,509 వ్యవసాయ సర్వీసులు ఉన్నాయి. వాణిజ్య సర్వీసులు 52,789, ఇండస్ట్రీ 3,727, కుటీర పరిశ్రమలు 1,721, స్రీట్లైట్లు, వాటర్ వర్క్స్ కనెక్షన్లు 5,711, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు 2,012సర్వీసులు, తాత్కాలిక కనెక్షన్లు 547, ఒక ఛార్జింగ్ కేంద్రం ఉంది.
సత్ఫలితాలిచ్చిన కార్యాచరణ
జిల్లాలో విద్యుత్ బిల్లులతో పాటు బకాయిలను పూర్తి స్థాయిలో వసూలు చేసే దిశగా విద్యుత్ అధికార యంత్రాంగం అనుసరించిన ప్రత్యేక కార్యాచరణ మంచి సత్ఫలితాలనిచ్చింది. సర్కిల్లోని ఏడు ఈఆర్వో కేంద్రాలుండగా, ప్రతి ఈఆర్వోలో టాప్-100 బకాయిల జాబితాను రూపొందించా రు. ఏఏవో సమన్వయంతో బకాయిలను రాబట్టే దిశగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అలాగే 50వేల పైబడి బకాయిలను డీఈ స్థాయి అధికారి, 50వేల నుంచి 20వేల వరకు ఉన్న బకాయిల వసూళ్ల బాధ్యతను ఏడీఈలు, 20వేల కం టే తక్కువగా ఉన్న బకాయిల వసూళ్లను ఏఈలు పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించారు. 2022-23ఆర్థిక సంవత్సరానికి సర్కిల్ డిమాండ్ 390.06కోట్ల ఉం డగా, వసూళ్లు 400.58 కోట్లు రాబట్టారు. వసూళ్ల లక్ష్యాన్ని 102.70శాతం సాధించారు.
సమష్టి కృషితోనే ప్రత్యేక గుర్తింపు
విద్యుత్ అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా పనిచేయడం ద్వారానే బిల్లు వసూళ్లలో కంపెనీలో కరీంనగర్ సర్కిల్ ముందు వరసలో నిలిచి ప్రత్యేక గుర్తింపు సాధించింది. సీఎండీ ఆదేశాలకు అనుగుణంగా డీఈ నుంచి క్షేత్రస్థాయి సిబ్బందిదాకా ప్రతి ఒక్కరి కృషితోనే లక్ష్యాన్ని అధిగమించగలిగాం. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల బిల్లుల గురించి అదనపు కలెక్టర్(లోకల్బాడీస్) దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా బిల్లులు త్వరితగతిన వసూళ్లయ్యాయి. ప్రభుత్వ సర్వీసుల బిల్లులు కూడా వసూలయ్యాయి.
– వీ గంగాధర్, ఎస్ఈ (కరీంనగర్ సర్కిల్)