దళారులను నమ్మి నష్టపోవద్దు
నకొండూర్ జడ్పీటీసీ శేఖర్గౌడ్
మానకొండూర్, ఏప్రిల్ 23: గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్ సూచించారు. ఊటూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని వెల్ది, రంగపేట గ్రామాల్లో, మానకొండూర్ ఏఎంసీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఊటూర్ సహకార సంఘం అధ్యక్షుడు ముద్దసాని ప్రదీప్రెడ్డి, వైస్ చైర్మన్ ఎడ్ల సతీశ్కుమార్, ఏఎంసీ చైర్మన్ వాల ప్రదీప్రావు, వైస్ చైర్మన్ పడాల సతీశ్గౌడ్, మానకొండూర్ సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, వెల్ది సర్పంచ్ రుద్రవరం లక్ష్మి, ఎంపీటీసీ రుద్రవరం పద్మ, నాయకులు ముద్దసాని శ్రీనివాస్రెడ్డి, పిట్టల మధు, నెల్లి మురళి, ఉండింటి శ్యాంసన్, పారునంది కిషన్, సీఈవో రవీందర్, అసిస్టెంట్ సీఈవో స్వామిరెడ్డి, ఊటూర్ సొసైటీ, మానకొండూర్ ఏఎంసీల డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా వైరస్ వ్యాప్తి కాషాయ పార్టీ పనే : దీదీ
బీమా సంస్థలపై చర్యలకు నిర్మలా సీతారామన్ ఆదేశం