దుర్గాపూర్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే కరోనా వైరస్ కేసులు పెరిగేలా కాషాయ పార్టీ వ్యవహరించిందని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం నిర్లక్ష్యంతోనే కొవిడ్-19 ఇన్ఫెక్షన్లు పెరిగాయని దీదీ విరుచుకుపడ్డారు. దుర్గాపూర్ లో శుక్రవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బెంగాల్ ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ దేశమంతటా వైరస్ కేసులను పెంచేందుకు కారణమైందని ఆరోపించారు.
పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత నెలకొందని దుయ్యబట్టిన దీదీ బెంగాల్ కు రావాల్సిన మెడికల్ ఆక్సిజన్ ను యూపీకి తరలించారని విమర్శించారు. బీజేపీ రాష్ట్రాలకే ఆక్సిజన్ సరఫరాలు సాగుతున్నాయని బెంగాల్ లో కరోనా పరిస్థితి దిగజారాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని మోదీ సర్కార్ పై ఆమె విమర్శలు గుప్పించారు.