చెరువులకు కాళేశ్వర జలాల పండుగ వచ్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో చుక్కనీరు లేక అడుగంటిన తటాకాలకు జలకళ వచ్చింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా 122 కిలోమీటర్ల మేర వరద కాలువ నిండుగా మారగా, తూముల ద్వారా పరవళ్లు తొక్కి, రైతన్న సాగు నీటి ఆశలను సజీవం చేస్తున్నది. ఇప్పటికే మెజార్టీ గొలుసుకట్టు చెరువులు నిండి అలుగుపారుతూ దిగువకు పరుగులు తీస్తుండగా, కర్షకలోకం మురిసిపోతున్నది.
కథలాపూర్/ మల్యాల/ జగిత్యాలరూరల్/ కోరుట్లరూరల్/ మేడిపల్లి/ జూలై15: చెరువులు కళకళలాడుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ కాళేశ్వర జలాలతో నిండుగా కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా ప్రాజెక్టులోని లింక్1, లింక్2లో నిరంతర ఎత్తిపోతలతో వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతూనే, మరోవై పు తూముల ద్వారా చెరువుల్లోకి చేరుతున్నాయి. వరుణుడు కరుణించకపోయినా, చినుకు రాలకపోయినా పరవళ్లు తొక్కుతూ ఇన్నాళ్లూ వట్టిపోయిన తటాకాలకు జీవం పోస్తున్నాయి.
మత్తడి దూకుతున్న చెరువులు..
కథలాపూర్ మండలంలోని తక్కళ్లపెల్లి ఉదక మ్మ చెరువు నిండింది. అలాగే దూలూర్కు చెం దిన నాలమల్లప్పకుంట మత్తడి దూకు తూ సిరికొండలోని నల్లచెరువులోకి పరవళ్లు తొక్కుతున్న ది. దీంతో మరో రెండు రోజుల్లో సిరికొండ గ్రా మంలోని నల్లచెరువు నిండనుంది. కోరుట్లలోని ఏకీన్పూర్ శివారులోని స్తంభాల చెరువు నిండుకుంటున్నది. అలాగే మెట్పల్లి మండలం జగ్గాసాగర్ శివారులోని వరదకాలువకు తూము ద్వారా సుమారు పదికిలోమీటర్లు ప్రవహించి 95 ఎకరాల విస్తీర్ణంలో 1200 ఎకరాల ఆయకట్టు ఉన్న మాన్పుర్ (మాటు కాలువ) స్తంభాల చెరువుకు జలాలు చేరుకుంటుండగా, రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. మేడిపల్లి మండలంలో చెరువులు నిండుతున్నాయి. కల్వకోట శివారులోని మొదటి తూము ద్వారా పెద్ద చెరువులోకి చేరిన జలాలు మత్తడి దూకుతూ కన్నేరుకుంటలోకి పరవళ్లుతొక్కుతున్నాయి. అక్క డి నుంచి చింతల చెరువులోకి వెళ్లుతున్నాయి. మరో తూము ద్వారా వీరన్నకుంట నిండుతున్నది.
ఊర చెరువుకు జీవం..
జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం ఊర చెరు వు నిండింది. ఇది వర్షాధార నీటితోనే నిండే ఈ చెరువు, నాలుగైదేండ్లుగా అడుగంటిపోయే ఉంది. దీంతో ఎంతో మంది రైతులు బోర్లు వేసి, బావు లు తవ్వించి అప్పులపాలయ్యారు. గ్రామానికి దగ్గరలో వరద కాలువ ఉన్నా చుక్కనీరందని పరిస్థితి. ఈ క్రమంలో రైతుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో వరద కా లువకు తూము ఏర్పాటు చేయించారు. ఈ క్ర మంలో నిండుగా మారిన వరద కాలువ తూము ద్వారా కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కడంతో పూర్తిగా నిండి, సాగుకకు భరోసా ఇచ్చింది. దీంతో రైతులు నారు పోసుకుంటూ సాగుబాట పట్టారు.
బండలింగాపూర్ చెరువు పరవళ్లు రైతుల ఆనందం
మెట్పల్లి రూరల్, జూలై 15: వరదకాలువ ద్వారా ఎదురెక్కుతున్న గోదావరి జలాలతో సా గునీటి ఇక్కట్లు తొలగుతున్నాయి. మెట్పల్లి మం డలం బండలింగాపూర్ పెద్ద చెరువును నింపేందు కు రాజేశ్వర్రావుపేట శివారులోని వరదకాలువ తూము ద్వారా వారం నుంచి అధికారులు నీటిని వదులుండగా, శనివారం 318 ఎకరాల ఆయకట్టు ఉన్న బండలింగాపూర్ పెద్దచెరువు నిండింది. మత్తడి దుంకి దిగువకు పరుగులు తీస్తుండగా, రైతులు సంబురపడ్డారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి పెద్దచెరువు నుంచి నీటిని తీసుకొచ్చి గ్రామ కూడలి వద్ద సీఎం కేసీఆర్, ఎ మ్మెల్యే విద్యాసాగర్రావు చిత్రపటానికి అభిషేకం చేశారు. వానలు ముఖం చాటేయడంతో సాగు ప్రశ్నార్థకమవుతుందన్న తరుణంలో పెద్ద చెరువు నింపి రైతుల్లో భ రోసా నింపిన దేవుడుసీఎం కేసీఆర్ అని కొనియాడారు. పీఏసీఎస్ చైర్మన్ నేరెళ్ల శంకర్రెడ్డి, ఉపసర్పచ్ చెప్యాల రాజం, బీఆర్ఎస్ నేతలు అంకం శంకర్, మురళి, జంగ స్వామి, రేండ్ల రాజ్కిరణ్, రైతులు బద్దం శేఖర్రెడ్డి, గంగారెడ్డి, గున్నాల బాలయ్య, గంగారాం, పెద్దభూమయ్య, మైలా రం గణపతి, చెప్యాల శంకర్ పాల్గొన్నారు.
వానలు పడకుండానే చెరువు నిండింది..
నాకు తక్కళ్లపల్లిలో నాలుగెకరాల భూమి ఉంది. పంటలు సాగు సమయం వచ్చింది. కానీ చుక్క వర్షం లేదు. ఎలా అని బాధపడుతుంటే సీఎం కేసీఆర్ ముందు చుపుతోనే కాళేశ్వరం జలాలు వదలడంతో మా గ్రామంలోని ఉదకమ్మ చెరువు నిండి మత్తడి దూకింది. ఇప్పుడు పంటల సాగుకు ఢోకా లేదు. కష్ట సమాయాల్లో రైతుల్లో ధైర్యం నింపి సాగుపై భరోసా కల్పించిన సీఎం కేసీఆర్ సారు రైతుల పాలిట దేవుడు. వానలు లేకున్నా చెరువు నింపిన గొప్ప తనం ఆయనకే దక్కుతుంది.
– వెంపేట గంగారెడ్డి, రైతు,తక్కళ్లపెల్లి (కథలాపూర్)
నీళ్లకు బాధలేదు..
మాది జగిత్యాల రూ రల్ మండలం అం తర్గాం. మా ఊర చెరువు నీళ్లు లేవు. పంటలు పండించాలంటే చెరువే ఆధారం. వర్షాలు పడుతలేవు. గప్పుడే సీఎం కేసీఆర్ సారు వరద కాలువకు కాళేశ్వర జలాలు వదిలిండు. మా చానా సంబురమైంది. మా ఎమ్మెల్యే సంజయ్ సార్ వరద కాలువకు ఏర్పాటు చేయించిన తూము ద్వారా మా ఊర చెరువు కాళేశ్వరం జలాలతో నిండింది. ఇప్పుడు సాగు నీటికి డోకా లేకుండా పోయింది. సాగు పనులు మొదలు పెట్టినం. చెరువు మరో నాలుగు రోజుల్లో మత్తడి దూకుతుంది.
– కాటిరెడ్డి గంగాధర్, రైతు, అంతర్గాం, (జగిత్యాల రూరల్)
సాగు నీటి గోస తీరినట్లే..
నాకు పదెకరాల భూమి ఉంది. కాళేశ్వ రం నీళ్లు రాకముందు రూ.10వేలు పెట్టి బా విల పూ డిక తీస్తే పది నిమిషాల మందం నీళ్లు ఎక్కువ వచ్చేవి. అయి తే కేసీఆర్ సారు ఎస్సారెస్పీని నింపేందుకు పంప్హౌస్లు కట్టించిండు. వరద కాలువ ఇగ ఎప్పుడూ నిండే ఉంటదని తెలిస్తే సంబురమైంది. రైతులందరం కలిసి పోయి ఎ మ్మెల్యే సంజయ్ సారును అడిదితే వరద కాలువకు తూము, పైప్లైన్ ఏర్పాటు చేయించిన్రు. ఈ సీజన్ల చుక్క వాన పడకున్నా మా ఊరచెరువు కాళేశ్వర జలాలతో నిండిపోయింది. ఇప్పుడు మా సాగు నీటి గోస తీరినట్లే.
– నోముల జనార్దన్రెడ్డి, రైతు ( అంతర్గాం)