జగిత్యాల రూరల్, మే 30: జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దయ్యిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల పట్టణం లో 14 జోన్లు, 121 సర్వే నంబర్లను జోన్లుగా మార్పు చేశామని, తద్వారా ఇళ్ల అనుమతులు సులభమయ్యాయన్నారు. మొదటి సారిగా గెలిచిన ఎమ్మెల్యేగా, మొదటి కౌన్సిల్గా రాష్ట్రంలో జోన్లను మొదటగా మార్పు చేయడం జరిగిందని, యావర్ రోడ్డు నేడు 100 ఫీట్ల వెడల్పు చేసి కమర్షియల్ జీవో తెచ్చామని చెప్పారు. కేం ద్రం గైడ్లైన్స్ ప్రకారమే మాస్టర్ ప్లాన్ జోన్లను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 130 మున్సిపాలిటీల్లో సర్వే చేస్తే జగిత్యాల 90శాతం పూర్తిగా నిండి పోయిందని, టీఆర్నగర్, లింగంపేట్, హస్నాబాద్, తిప్పన్నపేటను మున్సిపాలిటీలో కలిపినట్లు వివరించారు. కొందరు అధికారుల లోపం వల్ల రైతుల భూములు ప్లాన్లోని వివిధ జోన్లలో వచ్చాయన్నారు. ఆనాడు మాస్టర్ ప్లాన్ను మున్సిపల్ తీర్మానించినప్పుడు అన్ని పార్టీల కౌన్సిలర్లు కూడా ఉన్నారని, అప్పుడు ఓకే అని చెప్పి, ఇప్పుడు ప్రతిపక్షాలకు చెందిన నాయకులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు.
1996లో కేంద్రంలో కాంగ్రెస్ అ ధికారంలో ఉన్నప్పుడే మాస్టర్ ప్లాన్ ముసాయిదా చేశారన్నారు. జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ లేకనే అభివృద్ధికి దూరమైందని, సూల్, హాస్పిటల్ జోన్లలో ఇండ్లు, రెసిడెన్షియల్ జోన్లలో వ్యాపారాలకు అనుమతులెలా ఇచ్చారని ప్రశ్నించారు. లే అవుట్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టడం వల్లే వర్షాలు వస్తే డ్రైనేజీలు సరిపోని పరిస్థితి నెలకొందన్నారు. గొల్లపల్లి రోడ్డు విస్తరణలో ప్రతి పక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నామన్నారు. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, కంపోస్టు షెడ్డు, ఎఫ్ఎస్టీపీ, హరితహారం, పారులు, ఓపెన్ జిమ్లు, కూడలిలో సుందరీకరణ పనులు చేపట్టినట్లు వివరించారు. జగిత్యాల పురాతన మున్సిపల్ అని, కోరుట్లలో 100 ఫీట్ల రోడ్డు తీర్మానం చేస్తే అప్పుడున్న నాయకులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్పై మళ్లీ రివ్యూ చేస్తామని, మున్సిపల్, గ్రామ పంచాయతీ తీర్మానం ఉంటేనే ఆమోదం పొందడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మహేశ్, హెచ్సీఏ జిల్లా మెంబర్ దావ సురేశ్, సర్పంచులు గంగాధర్, లక్ష్మణ్ రావు, ప్రభాకర్, ఎంపీటీసీ మహేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాల ముకుందం, నాయకులు మల్లారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.