మేడిపల్లి, జనవరి 27 : ఓ రైతు పొలం పనుల కోసం ఇంటి నుంచి బైక్పై పొలం వద్దకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన చిలువేరి రాజం (55) అనే రైతు గురువారం పొలం పనులకు వెళ్లేందుకు తన ద్విచక్రవాహనంపై వెళ్తూ.. రోడ్డు దాటుతున్న క్రమంలో ఎదురుగా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన ఆలకుంట సాయి కృతిక్ అనే యువకుడు బైక్పై అతి వేగంగా వచ్చి రాజం బైక్ ను ఢీకొట్టాడు.
దీంతో రాజం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సుధీర్ రావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజం భార్య రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధీర్ రావు తెలిపారు. కాగా, మృతుడు రాజంకు సంతానం కలగకపోవడంతో ఐదు సంవత్సరాల పాపని దత్తత తీసుకున్నారు.