జగిత్యాల, జనవరి 2: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో సోమవారం జగిత్యాల డిపోకు కేటాయించిన సూపర్ లగ్జరీ బస్సును కలెక్టర్ జీ రవి, అదనపు కలెక్టర్ మకరంద్, డీటీవో శ్యాంనాయక్, డిపో మేనేజర్ వెంకటనర్సప్పతో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, ఆత్యాధునిక బస్సుల సేవలను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని, సంస్థ లాభాల బాటలో నడిచేలా చేయూతనందించాలన్నారు. అనంతరం బస్సు ప్రారంబించిన తర్వాత బస్సులో కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి ప్రయాణించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ
జిల్లా కేంద్రం లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ రవి, అదనపు కలెక్టర్ మందా మకరంద్తో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి సాధ్యమైనంత త్వరగా పరిషరించాలని పేర్కొన్నారు. రెవెన్యూ, భూ సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిషారం చూపాలని ఆదేశించారు. కాగా ప్రజావాణికి మొ త్తం 17 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.