జగిత్యాల: 5 ఏళ్ల చిన్నారిపై స్కూల్ అటెండర్ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన జిల్లాలోని మల్యాల మండలం రాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న 55 ఏళ్ల అటెండర్… ఈనెల 4న ఉదయం అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేయబోయాడు. బాలిక గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
అప్పటి నుంచి బాలిక భయం భయంగా ఉండటంతో ఏం జరిగిందని బాలిక తల్లిదండ్రులు ఆరా తీయగా.. ఆ ప్రబుద్ధుడు చేసిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులు మల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అటెండర్పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.