హైదరాబాద్ : జగిత్యాల నియోజక వర్గ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హైదరాబాద్లోని మంత్రి నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. జగిత్యాలలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల మౌలిక సదుపాయాల కోసం నాలుగున్నర కోట్ల రూపాయలను మంజూరు చేయాలన్నారు.
అలాగూ అన్ని గ్రామ పంచాయతీల కూడా నూతన భవనాలు, శిథిలావస్తలో ఉన్న గుల్లపేట, సింగరావుపేట, మహితాపూర్, బోర్నపల్లి, గ్రామాలకు నూతన పంచాయతీ భవనాలు మంజూరు చేయాలన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లకు, లింక్ రోడ్లకు దాదాపు రూ.15 కోట్ల నిధులు అవసరం అవుతాయని నిధులు మంజూరు చేయాలని కోరగా.. నిధులు మంజూరుకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.