జగిత్యాల : పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బస్తీ దవాఖాన, పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామంలో పల్లె దవాఖాన ఏర్పాటు కోసం గ్రామ నాయకులతో కలిసి స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు వారి ఇంటి వద్దనే అందించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. పల్లె దవాఖానల ఏర్పాటుతో పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం తోపాటుగా ఆర్థిక భారంకూడా తగ్గుతుందని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, ఐటీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన ఉందని అన్నారు.
అనంతరం గ్రామానికి చెందిన ఆంజనేయ చారి కూతురు ధరణి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట నాడెం రత్నమాల శంకర్, బక్కశెట్టి ఆంజనేయులు, పాయికారి సురేష్, ఎంబారి మహేష్, కిష్ట నారాయణ, అబ్దుల్లా, అభి, తిప్పని శ్రీనివాస్, బక్కశెట్టి నర్సక్క, అక్షయ్, విజయ్, నాయకులు, తదితరులు ఉన్నారు.