జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 14వ వార్డులో TUFIDC నిధు లతో నిర్మించిన కొత్తవాడ మున్నూరుకాపు సంఘం భవనాన్ని ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్:సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం కొత్త వాడ పాటశాలలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలకు అధిక నిధులు కేటాయిస్తూ మెరుగైన వసతులు కల్పిస్తుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, స్థానిక కౌన్సిలర్ కూతురు పద్మ, శివ కేసరి బాబు, డీఈ రాజేశ్వర్,మున్నూరు కాపు సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.