జగిత్యాల : జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 14 మంది ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన రూ.14 లక్షల 16వందల విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారిందన్నారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్ రావు, సర్పంచులు ప్రభాకర్, స్వప్న, లక్ష్మణ్ రావు, ఎంపీటీసీలు దమ్మ మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అర్బన్ మండల రైతుబంధు కన్వీనర్ జంబర్టి శంకర్,పాక్స్ వైస్ చైర్మన్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.