జగిత్యాల : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. ఆదివారం జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 1,22,500 రూపాయల విలువగల చెక్కులను ఇంటింటికి వెళ్లి స్వయంగా అందజేశారు. అలాగే కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను సైతం ఇంటికి వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేదలకు వరంగా మారాయన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఆ పథకాలను ప్రవేపెట్టారన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.