జగిత్యాల : జిల్లాలోని మల్యాల మండలంలో ఉన్న కొండగట్టు ( Kondagattu ) ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 83,91,502 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి టి. వెంకటేశ్(Temple EO Venkatesh) తెలిపారు. ఆలయంలో ఉన్న 9 హుండీలుండగా 28 రోజులుగా భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి వారిచే లెక్కించామని వివరించారు.
మిశ్రమ బంగారం ( Mixed gold ) 32 గ్రాములు, మిశ్రమ వెండి 4.5 కిలోలు, విదేశి కరెన్సీ (Foreign currency) 13 వచ్చాయని తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో కరీంనగర్ దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రశేఖర్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.