జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని మల్యాల మండలంలో బీజేపీ పార్టీకి చెందిన 40 మంది యువకులు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీలోనే ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.