రోజుకు 400 శాంపిల్స్ పరీక్షించే అవకాశం
త్వరలో రెండు వేలు పరీక్షించేలా ఆటోమెటిక్ మిషన్ జత చేస్తాం : మంత్రి ఈటల
కరీంనగర్, ఏప్రిల్ 23 నమస్తే తెలంగాణ: ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఇక ఇక్కడే నిర్వహిస్తున్నారు. కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన ఈ పరీక్షల కేంద్రాన్ని శుక్రవారం మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ దవాఖానల్లో, పీహెచ్సీలో కరోనా నిర్ధారణకు ర్యాపిడ్ యాంటిజన్ టెస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కచ్చితమైన నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షలే కీలకం. ఇప్పటి వరకు శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ పంపించాల్సి ఉండేది. నాలుగైదు రోజులకు గానీ అక్కడి నుంచి ఫలితాలు వచ్చేవి కాదు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఫలితాలు త్వరగా వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ల్యాబ్లో ప్రస్తుతం రోజుకు 400 శాంపిల్స్ను పరీక్షించే అవకాశం ఉంది. త్వరలో మరో ఆటోమెటిక్ మిషన్ను జత చేస్తామని, అప్పుడు రోజుకు వెయ్యి నుంచి రెండు వేల శాంపిల్స్ను పరీక్షించవచ్చని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
18 ఏండ్లు నిండిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్ : ఉత్తరాఖండ్ సీఎం
రకుల్ పింక్, బ్లాక్ అవుట్ఫిట్ అందాలు అదరహో