డెహ్రాడూన్ : రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన వారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ శుక్రవారం ప్రకటించారు.
మే మొదటి వారం నుంచి ఇందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ డ్రైవ్లో దాదాపు 50 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవల రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కొత్తగా 345 మంది డాక్టర్లను నియమించాం. కొవిడ్ విధుల్లో భాగంగా వీరిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రం నుంచి కరోనాను పారద్రోలేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
కరోనా రోగులు పెరిగినా ఇబ్బంది లేకుండా అన్ని ప్రభుత్వ దవాఖానలతోపాటు రిషికేశ్లోని ఎయిమ్స్, మన్హటన్లోని ఇందిరేశ్ హాస్పటళ్లలో 75శాతం పడకలను కేటాయించామని సీఎం రావత్ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి