సమన్వయంతో పనిచేయాలి
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
పీఆర్, రోడ్డు భవనాల శాఖ ఈఈ, ఎస్ఈలతో కరీంనగర్లో సమావేశం
చొప్పదండి, ఏప్రిల్ 8: చొప్పదండి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం టెండర్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశించారు. గురువారం నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణంపై పంచాయతీరాజ్, రోడ్డు భవనాల శాఖ ఈఈలు, ఎస్ఈలతో కరీంనగర్లో సమీక్షించారు. రోడ్ల నిర్మాణ అనుమతుల కోసం శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పర్యావరణ, అటవీ అనుమతుల్లో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకుని మంజూరైన రోడ్ల పనులు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. కొదురుపాక నుంచి ఒద్యారం రహదారి తొందరగా పూర్తి చేయాలని సూచించారు. శాభాష్పల్లి రోడ్డు, కొండగట్టు ఘాట్రోడ్డు, మల్యాల నుంచి ఆర్నకొండ, హిమ్మత్ నగర్ నుంచి కాసారం, బల్వంతాపూర్ నుంచి చర్లపల్లి రోడ్ల నివేదికలను అందజేయాలని సూచించారు. నియోజకవర్గంలోని పంచాయతీరాజ్, రోడ్డు భవనాల శాఖ రోడ్లకు సంబంధించిన రోడ్ల నిర్మాణాలకు ఎస్టిమేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజక వర్గంలో రోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్కు విన్న వించానని, అధికారుల నివేదిక ఇస్తే దానిని కూడా అందజేసి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పా రు. ఇక్కడ కరీంనగర్, జగిత్యాల ఉమ్మడి జిల్లా సూపరింటెంటెంట్ ఇంజినీర్ చందర్సింగ్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు సాంబశివరావు, శ్రీనివాస రావు, కరీంనగర్ జిల్లా పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రవీందర్రెడ్డి, యు.కె ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసరావు, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అసిస్టెంట్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మంటల్లో బోగీలు..టెన్షన్ లో అధికారులు