కమాన్చౌరస్తా, ఏప్రిల్ 4: నగరంలోని పలు చర్చిల్లో ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఏసుక్రీస్తు మరణించిన మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చిన శుభదినాన్ని పురస్కరించుకుని ఈస్టర్ వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో నగరంలోని పలు చర్చిల్లో ఆదివారం ఉదయమే సన్రైజ్ ప్రార్థనలు చేశారు. సీపీ కార్యాలయం వద్ద గల వెస్లీ కెథడ్రిల్ చర్చిలో పాస్టరేట్ చైర్మన్ శ్రీనివాస్నాయక్ ఈస్టర్ సందేశాన్ని వినిపించారు. అలహాబాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ జట్టి అలివర్ దైవ సందేశం ఇచ్చారు. క్రిస్టియన్ కాలనీలోని సీఎస్ఐ సెంటినరీ వెస్లీ చర్చిలో ఇన్చార్జి పాస్టరేట్ చైర్మన్ శ్రీనివాస్నాయక్ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా చర్చిల్లో క్వాయర్ బృందం ఆలపించిన గీతాలు అలరించాయి. సెయింట్ మార్క్ చర్చి, కొత్తయాస్వాడ రోడ్డులోని లూర్దుమాత చర్చి, జగిత్యాల రోడ్డులోని బెతస్తా చర్చిల్లో ప్రార్థనలు చేశారు. వెస్లీ కెథడ్రిల్ చర్చి ప్రెస్బెటర్ వాస్టన్, పాస్టరేట్ కార్యదర్శి కేఈ అనిల్కుమార్, ట్రెజరర్ ఆర్ వినయ్సాగర్, సభ్యులు, సీఎస్ఐ సెంటినరీ వెస్లీ చర్చిలో ప్రెస్బెటర్ ప్రశాంత్కుమార్, కార్యదర్శి నారాయణ, ట్రెజరర్ సుశీల్కుమార్, దీనదయాళ్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చూడండి..
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు