జగిత్యాల : ప్లాస్టిక్ నివారణ తోనే పారిశుధ్యం మెరుగవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 14,15,16,32 వార్డులను సందర్శించి పారిశుధ్య పనులనుపరిశీలించారు. డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను స్వయంగా తీశారు. పారిశుధ్య వాల్ పోస్టర్ను అంటించి ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు.
పట్టణ ప్రగతితో నగరాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు కూతురు పద్మ , తోట మల్లికార్జున్, కూతురు రాజేష్, కోరే గంగమల్లు, కమిషనర్ స్వరూప రాణి, డీఈ రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.