జగిత్యాల : మైనార్టీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణ 11వ వార్డ్ అమీనాబాద్లో సీడీపీ నిధులు రూ.8 లక్షలతో షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విపక్షాలు కుల మతాల కొట్లాటలు మాని పేదరికం పై కొట్లాడాలని ఆయన సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల,మాతాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతుందన్నారు. ప్రజలు అభివృద్ధి పనులు చూసి ఆశీర్వదించాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, కౌన్సిలర్ బాలే లత, టీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ మూజాహిద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు బారి, ఏఎంసీ వైస్ చైర్మన్ అసిఫ్,
అమీన్ ఉల్ హాసన్, రియాజ్ ఖాన్, మజీద్ కమిటీ అధ్యక్షుడు రహీమ్ తదితరులు పాల్గొన్నారు.