జగిత్యాల : పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. నాలుగో విడత పట్టణ ప్రగతిలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 20,21,37వ వార్డ్ లలో మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ శ్రావణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
జగిత్యాల అభివృద్ధికి మంచి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా నర్సరీలు పెట్టలేదన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పట్టణంలో 10 లక్షల మొక్కలు పెంచామన్నారు. మన పట్టణం బాగు పడాలంటే తడి, పొడి చెత్త గురించి ప్రతి ఒక్కరు విస్తృత ప్రచారం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్స్ అనుమల్ల కృష్ణహరి, అల్లే గంగసాగర్, తదితరులు పాల్గొన్నారు.