జగిత్యాల రూరల్ : దళితబంధు పథకం దళితులకు వరమని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన సుద్దాల లింగన్నకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్ను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు చాలా గొప్ప కార్యక్రమం అన్నారు. తర తరాలుగా దళిత బిడ్డలు వివక్షకు గురి అయ్యారు. వారిని అభివృద్ధి పథంలో తీసుకొచ్చేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ దళితుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. ఈ పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బోనగిరి నారాయణ, ఎంపీటీసీ భూపేల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నోముల శేఖర్రెడ్డి, మండల పార్టీ అధికార ప్రతినిధి చెన్నవేని సురేష్, నాయకులు కొట్టల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.