జగిత్యాల : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మంగళవారం జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్లో గల ఈవీఎంలను భద్రపరిచిన గోదామును తనిఖీ చే చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల ఈవీఎం లను తనిఖీ చేస్తామని తెలిపారు. గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించినట్లు వెల్లడించారు.
గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, కలెక్టరేట్ ఏవో హకీమ్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ మరియ తదితరులు పాల్గొన్నారు.