జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ స్థానాచారి కపిందర్ వేదోక్త ఆశీర్వచనాలతో కలెక్టర్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ చెక్కిళ్ల అశోక్, ఏఎసై చిలుక శ్రీనివాస్, ఆర్ఐ తిరుపతి ఉన్నారు.