జగిత్యాల : ఇంటి ముందు బట్టలు ఆరేసేందుకు కట్టుకున్న దండానికి ప్రమాదవశాత్తూ విద్యుత్ ప్రసారమై చిన్నారి మృతిచెందిన సంఘటన జిల్లాలోని మెట్పల్లి మండలం రామారావుపల్లెలో జరిగింది. ఎస్ఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన విలాసాగర్ గంగాధర్ – హేమ దంపతులకు కొడుకు, కూతురు మనుశ్రీ (7) ఉంది.
అయితే ఇంటి ముంగిట బట్టలు ఆరవేసుందుకు కట్టిన ఇనుప జేవైర్ తెగి కింద పడింది. వైర్ను గమనించిన మనుశ్రీ.. సరిచేసే సమయంలో ప్రమాదవశాత్తు జేవైర్కు విద్యుత్ ప్రసరించడంతో షాక్ తగిలి అక్కడే కుప్పకూలి మృత్యువాత పడింది. తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.