పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కడుపునొప్పితో బాధపడుతూ ఓవ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన కర్రె వెంకటి (63) కడుపు నొప్పి భరించలేక బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటి గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు.
చికిత్స కోసం హాస్పిటల్స్ తిరిగినా నయం కాకపోవడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.