Dharmapuri | ధర్మారం, ఫిబ్రవరి 7: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయ జాతర మహోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆలయ కమిటీ వారు ఆహ్వానించారు. మహా శివరాత్రి ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు స్వామివారి జాతర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇట్టి జాతర ఉత్సవాలకు హాజరు కావాలని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ లోని నివాసంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా జాతర ఉత్సవాల వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పెర్క రవీందర్, కమిటీ సభ్యులు చింతల తిరుపతి, ఉప సర్పంచ్ భైరి సురేష్, మాజీ ఎంపీటీసీ బెల్లల రోజారాణి – లక్ష్మణ్, వార్డ్ సభ్యులు తాళ్ల రాజయ్య, బెల్లాల అనిల్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దోనికేని తిరుపతి గౌడ్, యువజన విభాగం అధ్యక్షులు గుండ రవీందర్, నాయకులు సొల్లు అంజయ్య, పల్లె మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.